బీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి. మంగళవారం చందంపేట మండలం బండమీదితండా, పెద్దఅడిశర్లపల్లి మండలం గడ్డమీదితండాకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వేములపల్లి మండల కేంద్రంతోపాటు మొల్కపట్నానికి చెందిన పలువురు కాంగ్రెస్, సీపీఎం నుంచి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడ, కేతేపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన పలువురు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
కేతేపల్లి, అక్టోబర్ 3 : కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పే మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ సూచించారు. మండలంలోని కొత్తపేటకు చెందిన ముస్లిం మైనార్టీ నాయకుడు షేక్ లతీఫ్తోపాటు పలువురు ఇతర పార్టీల నాయకులు మంగళవారం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నుంచి పెద్దఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నట్లు చెప్పారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు 3 గంటలకు మించి కరెంటు ఇవ్వరని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో పాతరోజులు వస్తాయని తెలిపారు. రాష్ట్రంలో సబ్బండ వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న బీఆర్ఎస్కు మద్దతు తెలిపి మూడోసారి కేసీఆర్ను సీఎం చేయాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బచ్చు జానకిరాములు, ఉప సర్పంచ్ తండు రాములు, నాయకులు దాసరి సునీత, ఊర యాదగిరి, సైదులు, లింగయ్య, యాదగిరి, సత్యనారాయణ పాల్గొన్నారు.
పలువురు శాలివాహనులు బీఆర్ఎస్ చేరిక..
నార్కట్పల్లి : మండలంలోని ఎల్లారెడ్డిగూడెంలో శాలివాహన కులస్తులు పలువురు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గూలాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో సర్పంచ్ మేడి పుష్పలతాశంకర్, చిట్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొండూరు శంకర్, పీఏసీఎస్ చైర్మన్ రేగట్టె నారాయణరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.