అర్వపల్లి, ఫిబ్రవరి 26 : యోగానంద లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం అర్థరాత్రి గరుడోత్సవాన్ని నిర్వహించారు. విశేష పుష్పార్చన, ఆదిత్య హృనతు పారాయణం, వికనస మహర్షి విశేషార్చన కార్యక్రమాలను జరిపించారు.
స్వామి అమ్మవార్లను పల్లకిలో ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో దేవాలయ ఉత్సవ కమిటీ చైర్మన్ అనిరెడ్డి రాజేందర్రెడ్డి, మండలాధ్యక్షుడు మోరపాక సత్యం, అర్చకుడు రాంబాబు, పవన్కుమార్ పాల్గొన్నారు.