అర్వపల్లి, ఫిబ్రవరి 29 : అర్వపల్లియోగానంద లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం అర్ధరాత్రి పొన్నోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామివారు బాలకృష్ణుడి అవతారంలో, అమ్మవార్లు శ్రీదేవి, భూదేవి, గోపికల అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
గోపికలు కొలనులో స్నానమాచరిస్తుండగా బాలకృష్ణుడు వారి కోకలను దొంగిలించుకుపోయి పొన్న చెట్టుపై కూర్చునే ఘట్టాన్ని అర్చకులు నిర్వహించారు. ఉత్సవం అనంతరం స్వామి, అమ్మవారి విగ్రహాలను పొన్న చెట్టుపై నుంచి పుర వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో దేవాలయ ఉత్సవ కమిటీ చైర్మన్ అనిరెడ్డి రాజేందర్రెడ్డి, డైరెక్టర్ కనుక రేణుక, మాజీ జడ్పీటీసీ కొరపిడత అవిలయ్యయాదవ్, రమేశ్, అర్చకులు రాంబాబు అయ్యంగార్, పవన్కుమార్ పాల్గొన్నారు.