భూదాన్ పోచంపల్లి, ఆగస్టు 10 : రాష్ట్ర పురపాలక, చేనేత జౌళి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం భూదాన్ పోచంపల్లికి రానున్నారు. ఉదయం 11 గంటలకు చేరుకొని పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సాయిని భరత్ ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ యూనిట్ ప్రారంభం, నేతన్న విగ్రహావిషరణ, సమీకృత వెజ్, నాన్ వెజ్ మారెట్, ధోబీ ఘాట్, మురుగు కాల్వలు, సీసీ రోడ్ల శంకుస్థాపనలో పాల్గొననున్నారు. అనంతరం చేనేత వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి ప్రసంగించనున్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితో పాటు ఉమ్మడి జిల్లా
ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా హాజరుకానున్నారు. మంత్రి కేటీఆర్ రాక సందర్భంగా ఏర్పాట్లను శుక్రవారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, కలెక్టర్ వినయ్క్రిష్ణారెడ్డి, డీసీపీ రాజేశ్ చంద్ర పరిశీలించారు.
రాష్ట్ర మున్సిపల్, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ భూదాన్ పట్టణంలో శనివారం జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డితో కలిసి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేసిన నేతన్న విగ్రహాన్ని ఆవిషరించనున్నారు. అనంతరం బాలాజీ ఫంక్షన్ హాల్లో నిర్వహించే జాతీయ చేనేత వారోత్సవాల సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. కాగా, మంత్రి పర్యటన ఏర్పాట్లను శుక్రవారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి పరిశీలించారు. నేతన్న విగ్రహం, హ్యాండ్లూమ్ యూనిట్, టూరిజం పారులో భోజన వసతి ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రి పర్యటనను విజయవంతం చేయడానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న పద్మశాలీలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అదేవిధంగా మంత్రి కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి, డీసీపీ రాజేశ్చంద్రతో కలిసి పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.
సుమారు 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు డీసీపీ రాజేశ్చంద్రతెలిపారు. మంత్రి జిల్లా ఎమ్మెల్యేలు ఏర్పాట్లను పరిశీలించిన వారిలో జిల్లా హ్యాండ్లూమ్ ఏడీ విద్యాసాగర్, ఏసీపీ మొగులయ్య, ఎంపీపీ మాడుగుల ప్రభాకర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చిట్టిపోలు విజయలక్ష్మి, తాసీల్దార్ వీరాబాయి, ఎంపీడీఓ బాలశంకర్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.
మంత్రి కేటీఆర్ పర్యటన ఇలా..
రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి కేటీఆర్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు శనివారం విచ్చేస్తున్నారు. ఉదయం 11గంటలకు సాయిని భరత్ ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ యూనిట్ ప్రారంభం, 11:30కు నేతన్న విగ్రహావిషరణ చేయనున్నారు. 11:40 గంటలకు రూ.2 కోట్లతో నిర్మించే సమీకృత వెజ్, నాన్వెజ్ మారెట్కు శంకుస్థాపన.. రెండు కోట్లతో నిర్మించే ధోబీఘాట్, రూ.5:17 కోట్లతో అన్ని వార్డుల్లో చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు బాలాజీ ఫంక్షన్హాల్లో చేనేత వార్షికోత్సవాల్లో అనంతరం చేనేత వారోత్సవ సభలో ప్రసంగించనున్నారు.