కనగల్: తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేవానికి ఆదర్శంగా నిలిచాయని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని దర్వేశీపురంలో టీఆర్ఎస్ మండల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కా ర్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. రాష్ట్రంలో మరో 20ఏండ్లు టీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉం టుందన్నారు. పార్టీ బాగుంటేనే మనం బాగుంటామని, మనం బాగుండాలంటే పార్టీని పటిష్టం చేయాలని సూచించారు.
కార్యకర్తల కష్టాన్ని టీఆర్ఎస్ పార్టీ గుర్తిస్తుందన్నారు. ప్రతిపక్షాల అరోపణలను కార్యకర్తలు ఎప్పికప్పుడు తిప్పికొట్టాల న్నారు. వచ్చే నెల 15న వరంగల్లో జరిగే విజయగర్జన సభను విజయ వంతం చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందన్నారు. పీసీసీ రేవంత్ రాకతో గాందీ భవన్కు త్వరలోనే తాళాలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అనంతరం 1000మంది కార్యకర్తలకు భోజన వసతి కల్పించారు.
సీఎం సహయనిధి చెక్కులు పంపిణీ
కనగల్: మండల పరిధిలోని ఆయా గ్రామాలకు సంబంధించిన 33 మందికి సీఎం సహయనిధి చెక్కులను ఆదివారం కార్యకర్తల సమావేశంలోఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం సహయనిధి చెక్కులు నిరుపేదలకు వరమని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ఎంపీపీ కరీం పాష, జడ్పీ టీసీ చిట్ల వెంకటేశంగౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐతగోని యాదయ్యగౌడ్, వైస్ ఎంపీపీ రాంగిరి శ్రీధర్రావు,
పీఎసీఎస్ చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి, దోటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జోన్నలగడ్డ శేఖర్రెడ్డి, ఆలయ చైర్మన్ నల్లబో తు యాదగిరి, మహిళ అధ్యక్షురాలు మర్రి రేణుక, జిల్లా నాయకులు గోన రవీందర్రావు, హనుమంతు నాయక్, కడారి కృష్ణయ్య, బైరగోని వెంకన్న, శ్యామల చక్రి, చెనగోని నాగరాజు, హనుమంతు నాయక్, భార్గవ్, రవి, శంకర్రావు, పరమే ష్, శ్రీమాన్ ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామశాఖల అధ్యక్షులు, టీఆర్ఎస్ పార్టీ అనుబంధం సంఘం నాయకులు, ఉపసర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.