నల్లగొండ, డిసెంబర్ 27 : నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు శనివారం శాంతియుత నిరసన చేపట్టారు. ప్రభుత్వం తీసుకు వచ్చిన GO 252 సవరణకు డిమాండ్ చేస్తూ ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, డెస్క్, కేబుల్, ఇండిపెండెంట్ జర్నలిస్టులు భారీగా ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. శాటిలైట్, కేబుల్ టీవీ ఛానల్స్ అక్రిడేషన్లలో భారీ కోతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ‘మీడియా అక్రిడేటేషన్ కార్డు–మీడియా కార్డు’ రెండు కార్డుల విధానంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రిపోర్టర్లు–డెస్క్ జర్నలిస్టుల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నమని ఆరోపించారు. జీఓ 252లో స్పష్టత లేని నిబంధనలను వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు.

Nalgonda : నల్లగొండ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల ధర్నా
. . పార్ట్టైం, ప్రీ లాన్స్, ఇండిపెండెంట్ జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయంపై నిరసన. చిన్న పత్రికలు, వెబ్ సైట్, డిజిటల్ మీడియా జర్నలిస్ట్ లకు న్యాయం చేయాలని, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్కు జర్నలిస్ట్ నాయకులు వినతి పత్రం అందజేశారు. వినతి పత్రాన్ని ప్రభుత్వానికి పంపిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్త దీర్ఘకాలిక ఆందోళనలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు. జర్నలిస్టుల హక్కుల కోసం పోరాటం టీయూడబ్ల్యూజే స్పష్టం చేసింది. ఈ నిరసన కార్యక్రమంలో ఆయా పత్రికల ఎడిషన్ ఇన్చార్జీలు నాగేశ్వరరావు, జనార్దన్ రెడ్డి, డీజేటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పగడాల సురేశ్, ప్రధాన కార్యదర్శి తాడిశెట్టి లక్ష్మీనారాయణ, సభ్యులు నరేందర్, రాజు, అజీజ్, నాగరాజు, సురేశ్, వెంకటేశ్వర్లు, జాకీర్, శ్రీనివాస్, సాయి, శ్రీను, గిరి పాల్గొన్నారు.

Nalgonda : నల్లగొండ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల ధర్నా