శాలిగౌరారం: రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ పార్టీ విస్తరించి ఉందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మండల పరిధిలోని వల్లాల గ్రామానికి చెందిన బీజేపీ, కాండ్రెస్ పార్టీల నుంచి 7కుటుంబాలు శనివారం ఎమ్మె ల్యే సమక్షంలో టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ను చూసి పార్టీలో భారీగా చేరుతున్నారన్నారు. పార్టీలో చేరిన వారిలో బీజేపీ వార్డు మెంబర్ మాదగోని శివరాణినాగయ్య తో పాటు మరి కొంత మంది ఉన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐతగోని వెంకన్న గౌడ్, గ్రామాధ్య క్షుడు కొన్రెడ్డి వేణుగోపాల్రెడ్డి, భూపతి ఉపెందర్, శంకరయ్య ఉన్నారు.