సంస్థాన్నారాయణపురం, చౌటుప్పల్: పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని మునుగో డు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని మల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన త్రిజకు రూ.20వేలు, పద్మకు రూ.24వేలు, పుట్టపాక గ్రామానికి సాయికు రూ.40వేలు సీఎం సహాయనిధి నుంచి మం జూరైన చెక్కులను ఆయన హైదరాబాద్లో తన నివాసంలో లబ్ధిదారులకు అందజేశారు. టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు ఆడెపు పరదేశి, జిల్లా నాయకులు దేప విప్లవరెడ్డి, టీఆర్ఎస్వీ మునుగోడు అధ్యక్షుడు నలపరాజు రమేశ్, గ్రామాధ్యక్షుడు సుక్క గాలయ్య, ఆడెపు సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన ఆవుల కాశమ్మకు రూ.60వేలు, సుష్మకు రూ.16వేలు, సంగిశెట్టి ఎల్లయ్య కు రూ.లక్ష, యాదయ్యకు రూ. 60వేలు, లింగోజిగూడెంకు చెందిన శివనందినికి రూ.60వేల చొప్పున మంజూరైన చెక్కు లను హైద్రాబాద్లోని ఆయన నివాసంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుండబోయిన వెంకటేశ్ యాదవ్, నాయకులు ముటుకుల్లోజు దయాకరాచారి, సుర్కంటి మహేందర్రెడ్డి, కనకారెడ్డి, వీరమళ్ల సత్తయ్యగౌడ్ పాల్గొన్నారు.