సీఎం కేసీఆర్ సారథ్యంలో ప్రతి పల్లె నుంచి పట్టణానికి రోడ్లు సర్వాంగ సుందరంగా మారుతున్నాయి. ఇప్పటికే రోడ్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి గ్రామాల నుంచి మండలాలు, జిల్లా కేంద్రానికి రవాణా సౌకర్యం మెరుగుపరిచింది. ఇక గ్రామీణ ప్రాంతాలు, తండాల్లోని అంతర్గత రోడ్లపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా సూర్యాపేట నియోజకవర్గానికి మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో రూ.45 కోట్లు మంజూరయ్యాయి. కొత్తగా పంచాయతీలుగా ఏర్పడిన తండాలతోపాటు ఆవాస గ్రామాల్లో 50 కిలోమీటర్ల బీటీ రోడ్లు నిర్మించనున్నారు. రోడ్ల పనులను పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ ద్వారా త్వరలో ప్రారంభించనున్నారు. నిధుల మంజూరుపై ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నార్కట్పల్లి, డిసెంబర్ 2 : నార్కట్పల్లికి మహర్దశ. పట్టణాభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. నిధుల మంజూరు కాపీని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శుక్రవారం ఆయన నివాసంలో విడుదల చేశారు. పట్టణంలో డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్, డివైడర్స్ ఏర్పాటు వంటి పలు అభివృద్ధి పనులకు రూ.22 కోట్లు మంజూరు అయినట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, సహకరించిన మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నార్కట్పల్లి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఇటీవల రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ హైదరాబాద్ జోన్ ఈడీ పురుషోత్తం నాయక్తో కలిసి బస్ స్టేషన్ పరిధిలోని ఖాళీ స్థలాలను పరిశీలించి షాపింగ్ కాంప్లెక్స్, ఏసీ ఫంక్షన్ హాల్ నిర్మించేందుకు మెగా ప్లానింగ్ను రూపొందించి ఉన్నతాధికారులకు అందజేశారు. పట్టణంలో అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు పూర్తి అయ్యాయని, మిగతా చోట్ల కూడా పూర్తి చేస్తామని, దశల వారీగా నకిరేకల్ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఎమ్మెల్యే చిరుమర్తికి కృతజ్ఞతలు
నార్కట్పల్లి పట్టణాభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే నిరంతరం శ్రమిస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన రూ.22 కోట్లతో డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్, డివైడర్ ఏర్పాటుతో నార్కట్పల్లి పట్టణం ఎంతో సుందరంగా అభివృద్ధి చెందుతుంది. నిధుల విడుదలకు సహకరించిన మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి కృషి చేసిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు కృతజ్ఞతలు.
– సూదిరెడ్డి నరేందర్రెడ్డి, ఎంపీపీ