దేవరకొండ /పెద్దఅడిశర్లపల్లి, జనవరి 26 : ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. పీఏపల్లి మండలంలోని అక్కంపల్లి పునరావాస కేంద్రంలో నిర్మించిన అన్నపూర్ణాంబికా పరమేశ్వరి సహిత కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో గురువారం విగ్రహ శూపతిష్ఠాపనను భక్తిశ్రద్ధలతో కార్యక్రమంలో చైర్మన్, ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం దేవరకొండలోని షిరిడీ సాయిబాబ ఆలయంలో పంచమి ఉత్సవాల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, ఎంపీపీలు నల్లగాసు జాన్యాదవ్, వంగాల ప్రతాప్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శిరందాసు లక్ష్మమ్మ, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, పీఏసీఎస్ చైర్మన్ వల్లపురెడ్డి, తేరా భాస్కర్రెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.