మోటకొండూర్, మే 5 : భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి అన్నారు. మోటకొండూర్ మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో ఆదివారం బీఆర్ఎస్ ఎన్నికల వాల్ పోస్టర్ను ఆమె ఆవిషరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్యామ మల్లేశ్ను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. మోస పూరిత మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అబద్ధాలను ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సూదగాని హరిశంకర్ గౌడ్, పార్టీ మండలాధ్యక్షుడు బొట్ల యాదయ్య, జడ్పీటీసీ పల్లా వెంకట్ రెడ్డి, ఎంపీటీసీ పన్నాల అంజిరెడ్డి, నాయకులు పైళ్ల సత్యనారాయణ రెడ్డి, సూదగాని రాందాసు గౌడ్, భూమండ్ల ఐలయ్య, అనంతుల జంగారెడ్డి , ఎండీ బురాన్, ఎగ్గిడి కృష్ణ, ఎర్ర మల్లేశ్యాదవ్, చామకూర అమరేందర్ రెడ్డి, సైలాబ్ రెడ్డి, భూమండ్ల యాదయ్య, బీస కృష్ణంరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.