భువనగిరి అర్బన్, మే 23 : పట్టభద్రులు, ఉద్యోగుల సమస్యలు బీఆర్ఎస్తోనే పరిష్కారమవుతాయని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. వరంగల్-ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం పట్టణంలోని ఎస్ఎల్ఎన్ఎస్ బ్యాంకు ఉద్యోగులు, ప్రైవేట్ పాఠశాలలు, డిగ్రీ కళాశాలల ఉద్యోగులను కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావాలంటే శాసన మండలిలో ప్రశ్నించే గొంతుక ఉండాలన్నారు.
ఉన్నత విద్యావంతుడు అయిన రాకేశ్రెడ్డిని మండలికి పంపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి ఇబ్రహీం, బీఆర్ఎస్ పట్టణ, మండలాధ్యక్షులు ఏవీ కిరణ్కుమార్, జనగాం పాండు, నాయకులు జడల అమరేందర్గౌడ్, కొలుపుల అమరేందర్, ఎన్నబోయిన ఆంజనేయులు, చింత ల కిష్టయ్య, రచ్చ శ్రీనివాస్రెడ్డి, నీల ఓంప్రకాశ్, అజీమ్, పంగరెక్క స్వామి, సూరజ్, బబ్లూ, సుభా శ్, విజ్ఞాన్ పాఠశాల కరస్పాడెంట్ పడిగాల జలేందర్రెడ్డి, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.