నిడమనూరు, మార్చి 31 : కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతాంగం కన్నీళ్లు పెడుతున్నదని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. నిడమనూరు మండలంలోని వేంపాడు గ్రామంలో నీళ్లు ఎండిన రైతు చిమట శ్రీనుకు చెందిన వరి పంటను వారు ఆదివారం పార్టీ శ్రేణులతో కలిసి వేర్వేరుగా పరిశీలించారు. వరి సాగుకు పెట్టుబడి వ్యయం, నష్టం తాలూకు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భగత్ మాట్లాడుతూ పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి రైతాంగాన్ని కడుపులో పెట్టుకుని చూసుకున్నామన్నారు.
బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చి న కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగ ప్రయోజనాలను విస్మరించిందని, ఫలితంగా పంటలు ఎండిపోయి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని మండిపడ్డారు. నష్టపోయిన రైతులకు ప్రభు త్వం ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు ప్రయోజనాల పరిరక్షణకు బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ బొల్లం జయమ్మ, డీసీసీబీ డైరెక్టర్ విరిగినేని అంజయ్య, మాజీ మార్కెట్ చైర్మన్ కామర్ల జానయ్య, వేంపాడు మాజీ సర్పంచ్ అర్వ స్వాతీఅశోక్, ఎంపీటీసీ చిలుముల సంతోశ్కుమార్, నాయకులు ఆవుల పురుషోత్తం, భాస్కరి నారాయణ, దరీబు లింగప్ప, అన్నెబోయిన ఏడుకొండల్, నన్నెబోయిన సత్యనారాయణ, రమావత్ రవీందర్ నాయక్ పాల్గొన్నారు.