మిర్యాలగూడ, ఫిబ్రవరి 8 : కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్ర హక్కుల సాధనే లక్ష్యంగా ఈ నెల 13న నల్లగొండలో నిర్వహించే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, మిర్యాలగూడ నియోజకర్గ సమన్వయకర్త ఆదర్శ్రెడ్డి అన్నారు. మిర్యాలగూడ పట్టణంలో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ మండల ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను కేఆర్ఎంబీకి అప్పగించడం వల్ల రాష్ర్టానికి జరిగే నష్టాలను ప్రజలకు వివరించడానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారని తెలిపారు.
సభకు నియోజకవర్గ నుంచి 15వేల మందికి పైగా తరలివెళ్లాలని పిలుపునిచ్చారు. అనంతరం చలో నల్లగొండ పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంపీపీ అమరావతి సైదులు, పీఏసీఎస్ చైర్మన్ వెలిశెట్టి రామకృష్ణ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిట్టిబాబునాయక్, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు మట్టపల్లి సైదులుయాదవ్, నాయకులు గడగోజు ఏడుకొండలు, ఒగ్గు జానయ్య, బోగవెల్లి వెంకటరమణచౌదరి, భిక్షంగౌడ్, ఎంపీటీసీలు, మాజీ సర్పంచు లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.