నల్లగొండ, మే 24 : నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని గెలిపించాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కోరారు. నల్లగొండలోని కలెక్టరేట్లో ఆయన శుక్రవారం పలు శాఖల విభాగాల్లో ఉద్యోగులను కలిసి ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాకేశ్రెడ్డి ఉన్నత విద్యావంతుడు, సమాజ సేవకుడని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ప్రశ్నించే గొంతుక శాసన మండలిలో ఉంటేనే నెరవేరుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, కంచనపల్లి రవీందర్ రావు, వట్టిపల్లి శ్రీనివాస్, పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి, సయ్యద్ జాఫర్, మెరగు గోపి, దొడ్డి రమేశ్, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.