తిరుమలగిరి, ఏప్రిల్ 29 : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థ్ది క్యామ మల్లేశ్ను భారీ మెజార్టీతో గెలిపించి పార్టీ సత్తా చాటాలని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. తిరుమలగిరి పట్టణంలోని ఆయన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కేవలం కేసీఆర్తోనే సాధ్యమన్నారు. పార్లమెంట్లో తెలంగాణ ప్రజల గళం వినిపించాలంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థ్దులను గెలిపించుకొని తీరాలని పేర్కొన్నారు.
తెలంగాణ అస్థిత్వం బీఆర్ఎస్ పార్టీ అని, రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కేసీఆర్తోనే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు. అందుకే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థ్ది క్యామ మల్లేశ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా ప్రజల్లో చైతన్యం కల్పించాలని కార్యకర్తలకు సూ చించారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు రఘునందన్రెడ్డి, మాజీ ఎంపీపీ సతీశ్కుమార్, నాయకులు దూపటి రవీందర్, తెడ్డు భాస్కర్, సురేందర్, యాకూబ్నాయక్ పాల్గొన్నారు.