కట్టంగూర్, డిసెంబర్ 30 : గ్రామ దేవతలను పూజించడం మన సంప్రదాయమని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని మల్లారం సర్పంచ్ దాసరి సంజయ్కుమార్ ఆధ్వర్యంలో శనివారం గ్రామంలో నిర్వహించిన ఎల్లమ్మ కల్యాణోత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరాములు, వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, సర్పంచులు వడ్డె సైదిరెడ్డి, గుర్రం సైదులు, ఎంపీటీసీ ఎడ్ల పురుశోత్తంరెడ్డి, నాయకులు బీరెల్లి ప్రసాద్, పోగుల నర్సింహ, పెద్ది బాలనర్సయ్య, అంతటి శ్రీను, పోగుల నర్సింహ, వనం దుర్గయ్య పాల్గొన్నారు.