Genomics Seeds | చండూర్, ఏప్రిల్ 12 : రైతులు అధిక దిగుబడి ఇచ్చే వంగడాలను వాడాలని జెనోమిక్స్ సీడ్స్ సంస్థ టీఎస్ఎం సీహెచ్ నాగయ్య అన్నారు. జెనోమిక్స్ సీడ్స్ సంస్థ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మండల పరిధిలోని బోడంగిపర్తి గ్రామంలో జెనోమిక్స్ సీడ్స్ సంస్థ ప్రతినిధులు రైతు కట్కూరి నరసింహ వ్యవసాయ క్షేత్రాన్ని ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి, టీఎస్ఎం సీహెచ్ నాగయ్య మాట్లాడుతూ ప్రతీ ఒక్క రైతు కొత్త వంగడాలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. నాణ్యతతో కూడిన ఎక్కువ దిగుబడి ఇచ్చే రకాలను రైతులు పండిస్తే లాభసాటీగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రైతు వేసిన కొత్త రకం వరి పంటను పరిశీలించి రైతు అధిక దిగుబడి సాధించిన రైతులకు సన్మానించారు. ఈ కార్యక్రమంలో రైతన్న ట్రేడర్స్ డీలర్ దొమ్మాటి స్వామి, సంస్థ ప్రతినిధి నకిరేకంటి సైదులు గౌడ్, రైతులు మారగొని పాపయ్య, వరికుప్పల యాదగిరి, చొల్లేటి దశరథ, ఒట్టి కోటి శ్రీనివాస్, కటుకూరి సత్తయ్య, కారింగు నరసింహ, వరికుప్పల ముత్తయ్య, వరికుప్పల శ్రీనివాస్, ఎంపల్ల నరసింహ, దేవసారి యాదయ్య, ఓర్సు వెంకన్న, కట్కూరి కృష్ణయ్య, కట్కూరి నరసింహ, వరీకుప్పల వీరయ్య, రేవల్లి మహేష్, కారింగు రాజు, వరికుప్పల వెంకన్న, జక్కలి సిద్దు, నౌసు రాజు తదితరులు పాల్గొన్నారు.