పీఏపల్లి, జూన్ 4 : దేవరకొండ నియోజకవర్గంలోని పీఏపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. దుగ్యాల గ్రామంలో ఆ పార్టీకి చెందిన 120 కుటుంబాలు టీఆర్ఎస్ జిల్లా ఆధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సమక్షంలో శుక్రవారం రాత్రి గులాబీ కండువా కప్పుకొన్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే టీఆర్ఎస్లో చేరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ వంగాల ప్రతాప్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెలుగూరి వల్లపురెడ్డి పాల్గొన్నారు.