యాదగిరిగుట్ట, జూన్ 26: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన కార్యనిర్వహణ అధికారి భవానీశంకర్ పదవీ కాలాన్ని పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 30న ఆయన పదవీ విరమణ పొందుతుండటంతో ఆయన పదవీకాలంలో మరోఏడాది వరకు పొడిగించిన్నట్లు వెల్లడించారు. 2027 జూన్ 30 వరకు ఆయన దేవస్థాన ఈవోగా కొనసాగుతారని స్పష్టం చేశారు.
పదవీ విరమణ పొందే వరకు పొందిన వేతనంలో పింఛన్ మినహాయించగా మిగిలిన మొత్తం ఆధారంగా వేతనాన్ని నిర్ణయించిన్నట్లు చెప్పారు. గతంలో గవర్నర్కు జాయింట్ సెక్రెటరీగా పని చేసిన భవానీశంకర్ను దేవస్థాన ఈవోగా నియమిస్తూ ఈ ఏడాది జనవరి 17న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేయగా అదే నెల 29న పదవీ బాధ్యతలు స్వీకరించారు. తాజాగా మరోసారి ఆయన ఈవో పదవిని పొడిగించారు.