జకీయాలకు అతీతంగా అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం కేసీఆర్ పాలనే రాష్ర్టానికి శ్రీరామరక్ష అని, అరవై ఏండ్లలో జరుగని అభివృద్ధిని తొమ్మిదిన్నరేండ్లలో చేసి చూపించిన ఘనత ఆయనదేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సోమవారం అర్వపల్లిలో బీఆర్ఎస్ తుంగతుర్తి అభ్యర్థి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ ఎన్నికల ప్రచారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ సమైక్య పాలనలో తుంగతుర్తి నియోజకవర్గం హత్యలు, దాడులతో అట్టుడికిపోయిందని, నాడు రక్తం పారిన నేల నేడు కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలంగా మారిందని అన్నారు. 6వేల కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత కిశోర్దేనని తెలిపారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో విపక్షాలకు ఓటమి భయం పట్టుకుందని, కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. కిశోర్ కుమార్కు 50 వేల మెజార్టీ అందించి మరింత అభివృద్ధికి సహకరించాలని కోరారు.
– అర్వపల్లి, అక్టోబర్ 16
అర్వపల్లి, అక్టోబర్ 16 : తుంగతుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత గాదరి కిశోర్దేనని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ ఎన్నికల ప్రచారాన్ని అర్వపల్లిలో సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాదరి కిశోర్, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ గుజ్జా దీపికాయుగేందర్రావుతో కలిసి యోగానంద లక్ష్మీనర్సింహాస్వామి ఆలయంలో బీఫామ్ను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఆలయం నుంచి అర్వపల్లి వై జంక్షన్ వరకు కోలాటాలు ఆట పాటలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో తుంగతుర్తి నియోజకవర్గం కక్షలు, రక్తపు మరకలతో రగిలిపోయేదని, ఏ ఊరికి వెళ్లినా సమాధులు, స్థూపాలే దర్శనిచ్చాయన్నారు. కానీ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రక్తం పారిన నేలలో కాళేశ్వరం జలాలు పారుతూ ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఎక్కడ చూసినా నిండుకుండలా చెరువులు, కుంటలు దర్శనమిస్తున్నాయన్నారు.
రైతు బంధు పథకం దేశంలోనే గొప్ప పథకమని అభివర్ణించారు. యువతకు ఉపాధి కల్పించడం కోసం ఇండస్ట్రీయల్ పార్కు స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. 60యేండ్లలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ చేయని అభివృద్ధి పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు. రూ.6వేల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత కిశోర్దేనని కొనియాడారు. ప్రజల ఆలోచనల విధానాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోని ఎన్నికల్లో గెలుపొంది అధికారంలోకి రాగానే అమలు చేయనున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రతిపక్షాల గుండెల్లో ఓటమి భయం పట్టుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి పోటీ చేయడానికి అభ్యర్థులే కరువయ్యారని తెలిపారు. గాదరి కిశోర్ 50వేల మెజార్టీతో గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు.
అంతకు ముందు మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేను జడ్పీటీసీ దావుల వీరప్రసాద్యాదవ్ శాలువా, గజమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కాసోజు శంకరమ్మ, రైతు బంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్ ఎస్ఏ రజాక్, తిరుమలగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మినేని స్రవంతీసతీశ్, ఎంపీపీ మన్నె రేణుకాలక్ష్మీనర్సయ్యయాదవ్, పార్టీ మండలాధ్యక్షుడు గుండగాని సోమేశ్గౌడ్, ఆలయ కమిటీ చైర్మన్ చిల్లంచర్ల విద్యాసాగర్, మొరిశెట్టి ఉపేందరక్ష్, సర్పంచ్ బైరబోయిన సునీతారామలింగయ్య, ఎంపీటీసీ కనుకు పద్మాశ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
కిశోర్ హ్యాట్రిక్ విజయం ఖాయం
ఇది ఎన్నికల ప్రచారంలా లేదని, ఎమ్మెల్యే కిశోర్కుమార్ విజయోత్సవ ర్యాలీల ఉందని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. ఎమ్మెల్యే మంచి జోష్ మీద ఉన్నాడని, హ్యాట్రిక్ విజయం ఖాయమని తెలిపారు.
భారీ మెజార్టీ ఇవ్వాలి
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డి ఆశీర్వాదంతో తనకు మూడోసారి బీఫామ్ లభించిందని, రెండుమార్లు ప్రజలు ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించారని, మూడోసారి ఆశీర్వదించి భారీ మెజార్టీ ఇవ్వాలని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ కోరారు. శక్తి వంచన లేకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేశానన్నారు. రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. అర్వపల్లి యోగానంద లక్ష్మీనర్సింహస్వామి ఆశీస్సులు పొంది తాను గతంలో సైతం ప్రచారాన్ని ప్రారంభించానని, భగవంతుని ఆశీర్వాదం, ప్రజల ఆశీస్సులతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.