నందికొండ, డిసెంబర్ 28 : హరిత హారంలో భాగంగా అడవుల పునరుజ్జీవనాన్ని సమర్థవంతంగా చేపడుతున్నట్లు అమ్రాబాద్ టైగర్ ఫారెస్ట్ ఫీల్డ్ డైరెక్టర్ క్షితిజ అన్నారు. నందికొండ హిల్కాలనీలోని అటవీ సంక్షేమశాఖ కార్యాలయంలో బుధవారం జిల్లాస్థాయి బీట్ స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. గతేడాది చేపట్టిన అడవుల పునరుజ్జీవం ఎంత వరకు జరిగింది, ఇంకా ఎంత మేర చేపట్టాలనే విషయమై అధికారులకు సూచనలు చేశారు. అడవుల్లోని జంతువుల సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలను సూచించారు. అడవులల్లో హరిత హారం, బేస్క్యాంప్లు, టైగర్ రిజర్వ్లో అగ్ని ప్రమాదాలు జరుగకుండా చేపట్టాల్సిన చర్యలు, జంతువుల కోసం నీటి వసతి వంటివాటిపై వివరించారు. 2005 యాక్ట్ ప్రకారం ప్రభుత్వ సూచించిన తరహాలో ఫారెస్ట్ లాండ్ పట్టాలకు సంబంధించి సబ్ డివిజన్ స్థాయిలో సర్వే పూర్తి చేసినట్లు చెప్పారు. డివిజన్ స్థాయిలో ఇంకా చేపట్టాల్సి ఉందన్నారు. అర్బన్ పార్కు, ఎకోటూరిజంను అభివృద్ధి చేస్తూ అడవులను సంరక్షిస్తామన్నారు. కార్యక్రమంలో నల్లగొండ జిల్లా డీఎఫ్ఓ రాంబాబు, నాగార్జునసాగర్ ఎఫ్డీఓ సర్వేశ్వర్రావు, ఫ్లైయింగ్ స్కాడ్ ఎఫ్డీఓ శ్రీనివాస్, ఎఫ్ఆర్ఓ సాయిప్రకాష్, ఫారెస్ట్ అధికారులు మోహన్నాయక్, రమేశ్, సుమన్, అశోక్రెడ్డి, అన్నపూర్ణ, మానస, శ్రీదేవి, దేవరకొండ, నాగార్జునసాగర్, కంబాలపల్లి ఫారెస్ట్ బీట్ అధికారులు పాల్గొన్నారు.