రామగిరి, జనవరి 21: నల్లగొండ జిల్లా గ్రంథాలయ సంస్థ 2023-24 బడ్జెట్ను ఆమోదించినట్లు సంస్థ జిల్లా చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి వెల్లడించారు. జిల్లా గ్రంథాలయంలో శనివారం నిర్వహించిన సంస్థ సాధారణ సర్వసభ్య సమావేశంలోపలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రూ.6.66 కోట్ల బడ్జెట్ను ఆమోదించారు. సమావేశంలో పాలకవర్గ సభ్యులు డీపీఆర్ఓ శ్రీనివాస్, వయోజన విద్యా శాఖ కార్యాలయ అధికారి నర్సింహారెడ్డి, డీఈఓ కార్యాలయం నుంచి సెక్టోరియల్ అధికారి ఆర్.రామచంద్రయ్య, డీపీఓ లక్ష్మీనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బాలమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.
దాతల సహకారం అభినందనీయం
రామగిరి : గ్రంథాలయానికి దాతల సహకారం అభినందనీయమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి అన్నారు. నల్లగొండ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థులు సూరెడ్డి వెంకట్రామిరెడ్డి, శశికాంత్, భరణి, అశ్విన్ శనివారం జిల్లా కేంద్ర గ్రంథాలయానికి రూ.30వేల విలువచేసే రీడింగ్ టేబుల్, కుర్చీలను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సూరెడ్డి సరస్వతి, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్రెడ్డి, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.