కట్టంగూర్, నవంబర్ 23 : ప్రభుత్వం దశలవారీగా అర్హులందరికీ దళిత బంధు అందజేస్తున్నదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 67 మందికి మంజూరైన రూ.67.07లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం సహాయ నిధి చెక్కులను బుధవారం లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ నిరుపేద ఆడబిడ్డలకు పెద్దన్నల అండగా ఉంటూ ఆదుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరాములు, తాసీల్దార్ దేశ్యానాయక్, వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు పాలడుగు హరికృష్ణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నర్సింహ, పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
నకిరేకల్: పట్టణంలోని కాటమయ్య బజార్కు చెందిన దుస్స యాదగిరికి సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.24 వేలు మంజూరయ్యాయి. సంబంధిత చెక్కును యాదగిరి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య క్యాంప్ కార్యాలయంలో అందజేశారు.