రామగిరి, మార్చి 12 : సృష్టికి మూలం స్త్రీ అని, అలాంటి మహిళామణులను గౌరవించేలా సతారం చేయడం హర్షణీయమని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంఘాలకు నిర్మిస్తున్న ఆత్మగౌరవ భవనాలు ఆయా కుల వృత్తులను ఆధునీకరించేలా తమ జాతి అభివృద్ధికి పరిశోధనా కేంద్ర బిందువులు కావాలని ఆకాంక్షించారు. విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ నల్లగొండ జిల్లా ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురసరించుకొని వివిధ రంగాల్లో పనిచేస్తున్న విశ్వబ్రాహ్మణ మహిళలకు ఆదివారం నల్లగొండలోని హైదరాబాద్ రోడ్డులో గల విశ్వకర్మ భవన్లో నిర్వహించిన విశిష్ట సేవా పురసారాల మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మనుషులంతా ఒక్కటేనని, లోకకల్యాణార్థం తన బోధనను వ్యాప్తి చేస్తూ బ్రహ్మతత్వం, జ్ఞానాన్ని వ్యాప్తి చేసిన జగద్గురు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన సత్యాలు నేడు అనేక దర్పణాలుగా కనిపిస్తున్నాయన్నారు. సమాజానికి నాగరికతతోపాటు ఎన్నో అంశాలను తెలిపిన మూలపురుషుడు విశ్వకర్మ అని పేర్కొన్నారు.
ప్రతి పురుషుని విజయంలో స్త్రీ పాత్ర కీలకమైనదని, మహిళామణులు వెన్ను తట్టి ప్రోత్సహిస్తుండడంతోనే పురుషులు వివిధ హోదాల్లో విజయవంతంగా కొనసాగుతున్నారనేది జగమెరిగిన సత్యం అన్నారు. బీసీ కులాల పిల్లలు ఉన్నత చదువులు చదివేలా కేజీ టు పీజీ ఉచిత విద్యను అందించేందుకు ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు తెలిపారు. బీసీలంతా వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విశ్వకర్మ స్త్రీ శక్తిని గౌరవిస్తూ 48 మంది మహిళలకు సన్మానం చేయడం బృహత్తర కార్యక్రమమని కీర్తించారు. సన్మానం పొందిన వారంతా తమవంతుగా ఒక్కొక్కరు ఐదుగురు విద్యార్థులను తెలంగాణ గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంట్రెన్స్ రాయించి సీటు సాధించేలా ప్రోత్సహించాలన్నారు. విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు దాసుజు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ మారోజు నందకుమార్ ఆచారి, విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ మహిళా కార్యవర్గ సభ్యులు పర్వతం శోభారాణి, విశిష్ట అతిథులు, సినిమా డైరెక్టర్ సూరోజు మంజుల, రాష్ట్ర సాంఘిక, సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ చొల్లేటి పద్మ, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ బోదనపు సుమతి, అధ్యాపకురాలు కుచ్చెలకంటి పద్మజ, జిల్లా ప్రధాన కార్యదర్శి పెందోట సోము, మ్యారేజ్ బ్యూరో కన్వీనర్ పగిడిమర్రి వెంకటాచారి, నిర్వాహకులు దాసోజు బ్రాహ్మచారి, బొడ్డుపల్లి రామకృష్ణ, నరేంద్రబాబు, శ్రీనాథ్ పాల్గొన్నారు.