దేవరకొండ, సెప్టెంబర్ 29 : దేవరకొండ మున్సిపాల్టీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చి దిద్దుతామని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం పట్టణంలోని 10వ వార్డులో రూ. 30 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాల్టీ పరిధిలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో మహిళలకు బతుకమ్మ చీరెలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, మార్కెట్ కమిటీ చైర్మన్ శిరందాసు లక్ష్మమ్మాకృష్ణయ్య, వైస్ చైర్మన్ రాహత్అలీ, రైతుబందు సమితి మండలాధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, పీఏపల్లి ఎంపీపీ వంగాల ప్రతాప్రెడ్డి, టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు, వడిత దేవేందర్నాయక్, కౌన్సిలర్ జయప్రకాశ్నారాయణ, పొన్నబోయిన భూదేవీసైదులు, మల్లేశ్వరీశ్రీశైలం, కమిషనర్ వెంకటయ్య, ఏఈ రాజు, బొడ్డుపల్లి కృష్ణ, నల్లగాసు సత్యనారాయణ, చేరిపల్లి జయలక్ష్మి పాల్గొన్నారు.
మహిళా సంక్షేమానికి అధిక ప్రాదాన్యం
మాల్ : రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం చింతపల్లి మండల కేంద్రంలో మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేసి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి మన సంస్కృతీ, సంప్రదాయాలకు సీఎం కేసీఆర్ జీవనం పోస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమశాఖ స్టాండింగ్ కమిటీ జిల్లా చైర్మన్ కంకణాల ప్రవీణావెంకట్రెడ్డి, ఎంపీపీ కొండూరి భవానీ పవన్కుమార్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్రెడ్డి, సర్పంచ్ రాటకొండ రుద్రమాదేవి ప్రసాద్, ఎంపీటీసీ కుంభం శ్వేతా శ్రీశైలంగౌడ్, అండెకారు అశోక్, శ్రీనివాస్రెడ్డి, చాంద్పాషా, శ్రీనివాస్యాదవ్ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ రూరల్ : మండలంలోని బాదలాపురం, అవంతీపురం, ఆలగడప, జాలుబాయితండా, రాయినిపాలెం, ముల్కలకాల్వ, కొత్తగూడెం, లక్ష్మీపురం, రుద్రారం, కిష్టాపురం, గూడూరు, బోట్యానాయక్ తండాల్లో ఎంపీపీ నూకల సరళాహన్మంతరెడ్డి, జడ్పీటీసీ తిప్పన విజయ సింహారెడ్డి గురువారం మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, చిట్టిబాబు నాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మట్టపల్లి సైదులయ్యయాదవ్, వైస్ చైర్మన్ పూసపాటి రాజయ్య, ఎంపీడీఓ గార్లపాటి జ్యోతిలక్ష్మి, ఏపీఎం శేషయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యదర్శులు పాల్గొన్నారు.