చందంపేట(దేవరకొండ), ఫిబ్రవరి 9 : గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ అని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. శనివారం హైదరాబాద్లో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేతుల మీదుగా సేవాలాల్ మహారాజ్ జయంతి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సేవాలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగా ప్రకటించిందని తెలిపారు.
త్వరలోనే అసెంబ్లీ వద్ద సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాంచందర్నాయక్, మురళీనాయక్, రాందాసునాయక్, అనిరుద్రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, డీసీసీ అధ్యక్షుడు శంకర్నాయక్, వెంకన్న, కొర్ర రాంసింగ్నాయక్, కొర్ర శరత్నాయక్, కిన్నెర హరికృష్ణ పాల్గొన్నారు.