రామగిరి, జనవరి 26 : తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి హైదరాబాద్ ఈ నెల 24, 25న ఆన్లైన్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సైన్స్ ప్రదర్శనలో నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని జడ్పీ హైస్కూల్ – మాల్(వీటీనగర్) విద్యార్థి టి.అజయ్ ప్రాజెక్టు సౌత్ ఇండియా సైన్స్ ఫెస్టివల్కు ఎంపికైనట్లు డీఈఓ భిక్షపతి తెలిపారు.
‘పాస్కల్ పెయిడ్ ఇన్ బస్’ ప్రాజెక్టు ఎంపిక అవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జిల్లా సైన్స్ అధికారి వనం లక్ష్మీపతితోపాటు ఆ పాఠశాల హెచ్ఎం ఎ.వాణి, గైడ్ టీచర్ ఎం.శ్రీవిద్య, ఉపాధ్యాయులకు అభినందలు తెలిపారు. ఈ నెల 28నుంచి ఫిబ్రవరి 1వరకు సౌత్ ఇండియా సైన్స్ ఫెస్టివల్ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జరుగుతుందన్నారు. దీనికి సంబంధించి జిల్లా సైన్స్ అధికారిని సంప్రదించాలని కోరారు.
గరిడేపల్లి : దక్షిణ భారత స్థాయి రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శనకు గడ్డిపల్లి జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయురాలు మారం పవిత్ర ఎగ్జిబిట్ ఎంపికైంది. ఈ నెల 24, 25న ఆన్లైన్లో నిర్వహించిన ప్రదర్శనలో బోధనాభ్యాసన ప్రక్రియ చురుకుగా సాగేందుకు రూపొందించిన నమూనాలు టాప్టెన్లో నిలిచాయి. ఈ నమూనాల ద్వారా విద్యార్థులు క్లిష్టమైన, అమూర్త భావనలను తేలికగా అర్థం చేసుకోగలుగుతారని మారం పవిత్ర తెలిపారు. దక్షిణ భారత స్థాయికి ఎంపికైన ఉపాధ్యాయురాలు పవిత్రను పలువురు అభినందించారు.