బొడ్రాయిబజార్, డిసెంబర్ 4 : గ్రామీణ క్రీడాకారులు తమ ఆటను తీరును మెరుగుపర్చుకొని జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించాలని డీసీఎంఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా చైర్మన్ వట్టె జానయ్యయాదవ్ అన్నారు. సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న సూర్యాపేట జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాల బాలికల కబడ్డీ ఎంపికను ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. ఈ నెల 16నుంచి మంచిర్యాలలో జరుగనున్న రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు సూర్యాపేట జిల్లా బాల బాలికల జట్లను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. క్రీడలతో మానసికోల్లాసం, శారీరక దృఢత్వం ఏర్పడుతుందన్నారు.
ఇలాంటి క్రీడా పోటీలు గ్రామీణ క్రీడాకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బెల్లంకొండ రాంచందర్గౌడ్ మాట్లాడుతూ ఈ ఎంపికల్లో బాలురు 160, బాలికలు 170 మొత్తం 230 మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. వీరిలో 20మంది బాలురు, 20మంది బాలికలను ఎంపిక చేసి క్యాంపు నిర్వహించి వారి నుంచి తుదిజట్టును ఎంపిక చేస్తామన్నారు. కార్యక్రమంలో సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, పట్టణ సీఐ రాజశేఖర్, కబడ్డీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి నామా నర్సింహారావు, జాతీయ క్రీడాకారులు దేవరం రవీందర్రెడ్డి, కబడ్డీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.కే ఇమామ్, గడ్డం వెంకటేశ్వర్లు, శ్రీనివాసనాయుడు, వెంకట్రెడ్డి, మోహన్రెడ్డి, సునీల్, అంజిరెడ్డి, ప్రదీప్కుమార్, అసోసియేషన్ సభ్యులు వై.గోవింద్, యాదగిరి, మస్తాన్, సైదులు, రమేశ్ నామా నర్సింహారావు, గడ్డం వెంకటేశ్వర్లు, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.