యాదగిరిగుట్ట, అక్టోబర్ 22 : బీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి గొంగిడి సునీతను మరోసారి ఆశీర్వదిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి జరుగుతుందని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని నివాసంలో ఆదివారం ఆయన సమక్షంలో బొమ్మలరామారం మండలంలోని ప్యారారం నుంచి 100మంది, తుర్కపల్లి మండలంలోని తుర్కపల్లికి చెందిన 100మంది, రుస్తాపురం గ్రామానికి చెందిన 50మంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ తాము స్థానికులమని యాదగిరిగుట్టలోనే నిరంతరం అందుబాటులో ఉంటామన్నారు. ఎన్నికలు వస్తయ్ పోతయని ఓటర్లు విజ్ఞతతో ఆలోచించాలని సూచించారు. ఏ పార్టీ అధికారంలోకొస్తే అభివృద్ధి జరుగుతుందో ఆలోచించాలని కోరారు. బీఆర్ఎస్ పాలనలో ఆలేరును ఎంతో అభివృద్ధి చేశామన్నారు. బీఆర్ఎస్కు ప్రజలు హ్యాట్రిక్ విజయం అందించాలని కోరారు.
మాయమాటలు చెబుతూ గ్రామాల్లో తిరుగుతున్న మోసపూరిత కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో బొమ్మలరామారం ఎంపీపీ చీముల సుధీర్రెడ్డి, ఫక్కీర్గూడెం సర్పంచ్ మేడబోయిన గణేశ్, నాగినేనిపల్లి, రుస్తాపురం సర్పంచులు బట్కీర్ బీరప్ప, వంకరి లావణ్యానారాయణ, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు శశిధర్రెడ్డి, సీనియర్ నాయకులు చింతల గణేశ్, రైతుబంధు సమితి కన్వీనర్ మధుసూదన్రెడ్డి, బీఆర్ఎస్వీ నియోజవకవర్గ అధ్యక్షుడు ర్యాకల రమేశ్యాదవ్, తుర్కపల్లి వార్డు సభ్యుడు రాంబాబు, దత్తాయిపల్లి బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు మాదవరం విష్ణు, తుర్కపల్లి బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు ప్రసాద్ పాల్గొన్నారు.