కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి భాష అసహ్యంగా ఉన్నదని, తెలంగాణ ఉద్యమకారులను కించపరిచేలా మాట్లాడడం తగదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చెరుకు సుధాకర్ అన్నారు. సూర్యాపేటలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దళిత ఎమ్మెల్యే అయిన చిరుమర్తి లింగయ్య, మంత్రి జగదీశ్రెడ్డిపై అడ్డగోలుగా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. బీఆర్ఎస్కు కౌంట్డౌన్ స్టార్ట్ అయిందన్న రాజగోపాల్రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో కౌంట్లెస్ అని మండిపడ్డారు. జీవితమంతా బ్రోకర్ పనులు చేసిన కోమటిరెడ్డి బ్రదర్స్ జోకర్ పనులను బంద్ చేయాలన్నారు. మునుగోడు ప్రజలు ఇచ్చిన షాక్కు మతిభ్రమించిన రాజగోపాల్రెడ్డి పిచ్చివాడిలా రోడ్లపై తిరుగుతున్నాడని విమర్శించారు. రాజగోపాల్రెడ్డి వంటి మానసిక రోగిని భరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి హ్యాట్సాఫ్ అన్నారు.
సూర్యాపేట, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్కు కౌంట్డౌన్ స్టార్ట్ అయిందన్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో కౌంట్లెస్ అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చెరుకు సుధాకర్ అన్నారు. ఇటీవలి కోమటిరెడ్డి బ్రదర్స్ చేసిన అనుచిత వ్యాఖ్యలను బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెరుకు సుధాకర్ మాట్లాడుతూ కోమటిరెడ్డి బ్రదర్స్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కోమటిరెడ్డి బ్రదర్స్ జీవితమంతా బ్రోకర్, జోకర్ పనులే చేశారని, వారి వల్ల రాజకీయాలకే కలంకం వస్తుందని తెలిపారు. ఎన్నికల్లో రాజకీయ నాయకుల విమర్శలు, ప్రతి విమర్శలు సాధారణమైనా నకిరేకల్, సూర్యాపేట, తుంగతుర్తిలో రాజగోపాల్రెడ్డి మాట్లాడిన భాష, ప్రవర్తించిన తీరు అత్యంత అసహ్యకరంగా ఉందన్నారు.
దళిత ఎమ్మెల్యేను పట్టుకొని పెండ పిసికే వాడని హేళన చేసిన రాజగోపాల్రెడ్డి పీకలు నొక్కే వాడికి మద్దతు ఇస్తుండడం మరింత దారుణమన్నారు. మునుగోడులో ఉప ఎన్నిక తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని అధఃపాతాలానికి తొక్కాలని చూసిన రాజగోపాల్రెడ్డి పక్కా కమర్షియల్ లీడర్ అని తెలిపారు. దళిత ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఉద్యమకారుడు మంత్రి జగదీశ్రెడ్డిపై రాజగోపాల్రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. నల్లగొండ జిల్లా ఉద్యమ స్ఫూర్తిని అవమానించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నట్లు వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజశేఖర్రెడ్డి పాద సేవలో ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్కు ఉద్యమ నాయకుడు, మంత్రి జగదీశ్రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12కు 12 స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేసిన సత్తా ఉన్న నాయకుడు జగదీశ్రెడ్డి అని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గేటు తాకనీయంమటున్న రాజగోపాల్రెడ్డి అసెంబ్లీ ఆయన జాగీర్ కాదన్న విషయం గుర్తించాలన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ భువనగిరి పార్లమెంట్ పరిధిలో శాసన సభ టికెట్లు ఇస్తామని కోట్లు దండుకుంది నిజం కాదా అని ప్రశ్నించారు.
మునుగోడు ప్రజలు ఇచ్చిన షాక్కు మతి భ్రమించిన రాజగోపాల్రెడ్డి పిచ్చి వాడిలా రోడ్లపై తిరుగుతున్నడని విమర్శించారు. రాజగోపాల్రెడ్డి లాంటి పనికిరాని వాడితో చర్చలు జరిపే స్థాయి తమది కాదన్నారు. రమేశ్రెడ్డికి వయసు అయిపోలేదన్న రాజగోపాల్రెడ్డి ఆయనకు ఏమంత వయసు అయిపోయిందని బీజేపీని వీడిండని ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన రాజగోపాల్రెడ్డిని ఓడించడానికి ఇన్చార్జిగా పని చేసిన దామోదర్రెడ్డిని ఇప్పుడు పక్కన తిప్పుకోవడం సిగ్గు చేటని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ను ఎందుకు దించాలో చెప్పే దమ్ము కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా ఉందా అంటూ సవాల్ విసిరారు. ప్రత్యామ్నాయం చూపించాలనుకునే కాంగ్రెస్ నాయకులు ముందు వారి ఎజెండా ఎందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉదయ్పూర్ డిక్లరేషన్ను తుంగలో తొక్కి ఓబీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం సిగ్గు చేటని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాము పోటీ చేసిన చోట గెలవలేని కోమటిరెడ్డి బ్రదర్స్ ఇంకొకరిని ఎలా గెలిపిస్తారని ఎద్దేవా చేశారు.
వీరేశాన్ని వీరుడు అన్న రాజగోపాల్రెడ్డి అదే వీరేశం హంతకుడు అన్నది నిజమో కాదో చెప్పాలన్నారు. హంతకుడిని వీరుడన్న రాజగోపాల్రెడ్డి, కోదండరామ్ సిగ్గు పడాలన్నారు. పిచ్చి రాజగోపాల్రెడ్డి గురించి ఆయన స్వగ్రామం బ్రాహ్మణ వెల్లంల గ్రామస్తులకే బాగా తెలుసన్నారు. చిన్నతనంలో బస్సుపై రాళ్లు వేసి అద్దాలు ధ్వంసం అయితే సంతోషపడే మానసిక రోగి రాజగోపాల్రెడ్డి అని ఆ విషయం వారి ఊరిలో ఎవరిని అడిగినా చెప్తారన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇప్పటికైనా జాగిర్దార్ రాజకీయాలను బంద్ చేయకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ రామ్మూర్తియాదవ్, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బాలసైదులుగౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్ పాల్గొన్నారు.