Gutha Sukender Reddy : తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇండస్ట్రీ, ఐటీ పాలసీలతో పెట్టుబడులు పెట్టడానికి చాలా కంపెనీలు ముందుకు వచ్చాయని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్గొండలోఎన్జీ కాలేజి గ్రౌండ్లో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఏర్పాటు చేసిన ఆటో షో ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. ఛైర్మన్ మాట్లాడుతూ… ఇలాంటి ఆటో షోలు గతంలో కేవలం హైదరాబాద్లోనే చూసేవాళ్ళం. కానీ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అన్ని జిల్లాలు ఎంతో అభివృద్ధి చెందాయని అన్నారు. ప్రజలు ఆర్థికంగా మెరుగుపడ్డారని, వాళ్ల కొనుగోలు శక్తి పెరిగిందని గుత్తా తెలిపారు. ఆటో షోలో లక్కీ డ్రా తీసి, ఎంపికైన వారికి సుఖేందర్ రెడ్డి బహుమతులు అందజేశారు.
అంతేకాదు స్టాళ్లను సందర్శిస్తూ, కొనుగోలుదారులకు ఛైర్మన్ వాహనాలను అందజేశారు. ఆటో షో ఏర్పాటు చేసిన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే యాజమాన్యానికి, సిబ్బందికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నమస్తే తెలంగాణ బీఎం మహేందర్. బ్యూరో ఇంచార్జి మహేందర్ రెడ్డి. ఎడిషిన్ ఇంచార్జి నరేందర్, తెలంగాణ టుడే బ్యూరో శ్రీనివాస్, సర్క్యులేషన్ మేనేజర్ మల్సూర్ గౌడ్ ఏడీవీటీ మేనేజర్ శివ కుమార్, నమస్తే తెలంగాణ సిబ్బంది, వివిధ సంస్ధల ప్రతినిధులు పాల్గొన్నారు. నల్గొండ టౌన్లోని ఎన్జీ కాలేజి గ్రౌండ్లో రెండు రోజుల పాటు నిర్వహించిన ఆటో షోకు విశేష స్పందన లభించింది. ఈ ఆటోషోలో నల్లగొండతో పాటు హైదరాబాద్లోని పలు వాహన షో రూం నిర్వాహకులు పాల్గొన్నారు. షోకు వచ్చిన ప్రజలు వాహనాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. చాలామంది కార్లు, బైకులు కొనుగోలు చేశారు.