యాదగిరిగుట్ట రూరల్, ఆగస్టు 28 : రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నిర్వహించిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో సజావుగా కొనసాగింది. పోచంపల్లిలోని సెయింట్ మేరీ ఇంజినీరింగ్ కళాశాల పరీక్ష కేంద్రాల వద్ద చౌటుప్పల్ ఏసీపీ ఉదయ్రెడ్డి ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.
అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోపలికి పంపించారు. మొత్తం 4,200 మంది అభ్యర్థులకు 3,290 మంది అభ్యర్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. రాచకొండ ఏఆర్ అడిషనల్ డీసీపీ భాస్కర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా భువనగిరి ట్రాఫిక్ ఏసీపీ సైదులు పర్యవేక్షించారు.