నకిరేకల్, నవంబర్ 27 : సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను ఒప్పించి సుమారు రూ.100కోట్లతో అయిటిపాముల లిఫ్టు ఇరిగేషన్ను మంజూరు చేయించామని, దీంతో కడపర్తి సహా ఏడు గ్రామాలకు శాశ్వత సాగు నీరందించేలా ప్రణాళికలు రూపొందించినట్లు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి తెలిపారు. ఆదివారం వారు నకిరేకల్ మండలంలోని కడపర్తి గ్రామంలో యాదవ, గౌడ సంఘ భవనాలు, సోమేశ్వర ఆలయంలో రేకుల షెడ్డును ప్రారంభించి మాట్లాడారు.
మొదటి నుంచి కడపర్తి గ్రామంపై అపారమైన ప్రేమ ఉందన్నారు. సుమారు రూ.1.25కోట్లతో కడపర్తి గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. తమ సొంత గ్రామాల కంటే కడపర్తి గ్రామానికే ఎక్కువ నిధులిచ్చామన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకం తాకని గడపే రాష్ట్రంలో లేదన్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో లేని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. లిఫ్టు ఇరిగేషన్తో కడపర్తి రైతన్నలే ఎక్కువ లబ్ధి పొందుతారన్నారు. అయిటిపాముల లిఫ్టును మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు ఈ ప్రాంత రైతాంగమంతా జీవితాంతం రుణపడి ఉంటారన్నారు.
రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్కు అండగా ఉండి దేశ రాజకీయాల్లోనూ పాలు పంచుకోవాలన్నారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ మాద ధనలక్ష్మీనగేశ్, వైస్ ఎంపీపీ గొర్ల సరితావీరయ్య, మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్గౌడ్, వైస్ చైర్మన్ మురారిశెట్టి ఉమారాణీకృష్ణమూర్తి, ఎంపీడీఓ లక్ష్మారెడ్డి, కార్యదర్శి నాగమణి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల సోమన్న, సీనియర్ నాయకులు రంగారెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు ప్రగడపు నవీన్రావు, ప్రధాన కార్యదర్శి నోముల కేశవరాజు, పీఏసీఎస్ చైర్మన్ మహేందర్రెడ్డి, నాయకులు పెండెం సదానందం, శేఖర్, గణేశ్, పరమేశ్, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.