మేళ్లచెర్వు, ఫిబ్రవరి 23 : మేళ్లచెర్వులోని స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో మార్చి 8 నుంచి 12 వరకు జరుగనున్న మహా శివ రాత్రి జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలని, అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ వెంకట్రావ్ సూచించారు. దేవాలయ ఆవరణలో శుక్రవారం ఎస్పీ రాహుల్హెగ్డేతో కలిసి జాతర ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. జాతరకు ఇటీవల మంజూరైన రూ. కోటి నిధులతో ఏర్పాట్లు చేయాలని, తాగునీరు, శానిటేషన్, క్యూలైన్లతోపాటు పార్కింగ్కు వసతి కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలు, ఫ్లడ్ లైట్లు పెట్టించాలన్నారు. అనంతరం ఆలయ పరిసరాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, కోదాడ డీఎస్పీ శ్రీధర్రెడ్డి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మహేంద్రకుమార్, ఈఓ గుజ్జుల కొండారెడ్డి, ఎంపీపీ కొట్టె పద్మాసైదేశ్వర్రావు, జడ్పీటీసీ శాగంరెడ్డి పద్మాగోవిందరెడ్డి, తాసీల్దార్ జ్యోతి, ఎంపీడీఓ ఖాజా అజ్గర్అలీ, కోదాడ రూరల్ సీఐ రజితారెడ్డి, ఎస్ఐ పరమేశ్, పలు శాఖల అధికారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.