సూర్యాపేట, డిసెంబర్ 20: మున్సిపాలిటీల్లోని పెండింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలని, పనుల్లో నిర్లక్ష్యం వహించే ఏజెన్సీలను బ్లాక్ లిస్ట్లో పెట్టాలని, ఆ పనులను కొత్త ఏజెన్సీలతో చేపట్టాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత ఇంజినీరింగ్ అధికారులతో మున్సిపాలిటీల్లో జరుగుతున్న అభివృద్ధి, పెండింగ్ పనులు, నిధుల లభ్యతపై అదనపు కలెక్టర్ ప్రియాంకతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
మున్సిపాలిటీల్లో తాగునీరు, పారిశుధ్య పనులు, జంక్షన్లలో లైటింగ్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మున్సిపాలిటీల్లోని జంక్షన్లలో లైటింగ్ ఏర్పాటుకు ముందస్తు అనుమతులు తీసుకోవాలన్నారు. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తైన వాటిని సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే వివిధ దశల్లో ఉన్న సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు. పనుల నాణ్యతలో రాజీ పడొద్దని చెప్పారు. పనులు నాణ్యత ప్రమాణాల కోసం తనిఖీలు చేపట్టాలన్నారు. ఎల్ఆర్ఎస్ నిధులు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని చెప్పారు. సీపీఓ వెంకటేశ్వర్లు, కమిషనర్లు రామానుజులరెడ్డి, వెంకటేశ్వర్నాయక్, శ్రీనివాస్రెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
మాదక ద్రవ్యాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ ఆదేశించారు. యు వత మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా చూడాలని అలాగే జిల్లా స్థాయిలో విస్తృత అవగాహన కార్యక్ర మాలు నిర్వహించాలని సూచించారు. ఎస్పీ రాహుల్ హేగ్డేతో కలిసి బుధవారం కలెక్టరేట్లో నార్కోటిక్ నిరోధక కో- ఆర్డినేషన్ కమిటీ జాయింట్ యాక్షన్ ప్లాన్పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ జిల్లా సరిహద్దుల్లో నిఘా ఏర్పాటు చేయాలని చెప్పారు. అధికారులు సమన్వయంతో పనిచేసి మాదక ద్రవ్యాలను అరికట్టాల న్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనిత, డీఎస్పీ రాములు, డీఎంహెచ్ఓ కోటా చలం, డీపీఓ యాదయ్య పాల్గొన్నారు.