నీలగిరి, ఫిబ్రవరి 15 : పంచెలు, లుంగీలతోపాటు బెడ్షీట్ల తయారీపైనా దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన మరమగ్గం నేత కార్మికులకు సూచించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని పద్మానగర్లో పవర్లూమ్ యూనిట్లను గురువారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా నేత ఉత్పత్తిదారులతో మాట్లాడుతూ పవర్లూమ్ మిషన్లు, డయింగ్, మారెటింగ్, రా మెటీరియల్, అమ్మకాలు, గిరాకీ, లాభాలు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు.
మరమగ్గాల ద్వారా నేత ఉత్పత్తులు చేస్తున్న నేత కార్మికులందరూ బెడ్షీట్ల తయారీపై దృష్టి సారించాలన్నారు. వాటిని హాస్పిటళ్లు, ఇతర ప్రదేశాల్లో ఎకువగా వినియోగించుకునేందుకు అవకాశం ఉన్నందున మంచి మారెటింగ్ ఉంటుందని తెలిపారు. కాటన్తోపాటు సిల్ ఉత్పత్తులపై దృష్టి సారించాలని సూచించారు. పవర్లూమ్స్ ద్వారా మరిన్ని ఉత్పత్తులు చేపట్టి ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేయాలన్నారు. అమె వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, చేనేత శాఖ డెవలప్మెంట్ ఆఫీసర్ రంజిత్కుమార్, నేత సంఘాల ప్రతినిధులు ఉన్నారు.