కోదాడ, ఆగస్టు 22 : నిరుపేదల ఆరోగ్య భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ దవాఖానాలో రూ.3.14 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ యంత్రాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో రూ.26 కోట్లతో వంద పడకల దవాఖానను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆస్పత్రి విస్తరణలో భాగంగా జరుగుతున్న పనుల్లో వేగం పెంచాలని సిబ్బందికి ఆమె సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, ఆర్డీఓ సూర్యనారాయణ, డి సి హెచ్ ఎస్ వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దశరథ, కమిషనర్ రమాదేవి, పీసీసీ డెలిగేట్ చింతకుంట లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు, వైద్యులు అభిరామ్, వైష్ణవి, నరసింహ, నాయకులు కేఎల్ఎన్ ప్రసాద్, కందుల కోటేశ్వరరావు, నలజాల శ్రీనివాస్, కమదన చందర్ రావు, మధు, ఈదుల కృష్ణయ్య, బాగ్దాద్, భాజాన్ ముస్తఫా పాల్గొన్నారు.