చండూరు, నవంబర్ 29 : మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి తీరుతానని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. చండూరు మున్సిపాలిటీలో మంగళవారం వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. సమయం తక్కువగా ఉండటంతో నిద్ర కూడా పట్టడం లేదని, త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. చండూరు మున్సిపాలిటీని అన్ని విధాలా ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. రోడ్డు విస్తరణతోపాటు మునుగోడు మార్గంలో బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం ఉన్న 6 పడకల ఆస్పత్రిని 30 పడకలుగా మారుస్తామన్నారు. అంగడిపేటలో ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. చండూరు, మర్రిగూడ, నాంపల్లి, మునుగోడు, గట్టుప్పల మండలాలతో చండూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుందని ప్రకటించారు. స్థలాలు ఉండి ఇళ్లు లేని వారికి త్వరలోనే ఇండ్లు మంజూరు కానున్నాయని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ తోకల చంద్రకళావెంకన్న, కమిషనర్ ఎస్వీ మణికరణ్, వైస్ చైర్మన్ సుజాతావెంకన్న, కౌన్సిలర్లు కోడి వెంకన్న, కీర్తీసంజయ్, మంగమ్మ, యాదయ్య, రాధికాశ్రీనివాస్, వెంకటేశం, మండలాధ్యక్షుడు వెంకన్న, పట్టణాధ్యక్షుడు దశరథ, టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు ఎం.వెంకన్న, అధికారులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
మునుగోడు రూరల్ : మండలంలోని కిష్టాపురానికి చెందిన కాటంరాజుకు లక్ష, రాములమ్మకు మంజూ రైన రూ.52,500 సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంగళ వారం ఎమ్మెల్యే కూసుకుంట్ల వారికి అందజేశారు.