గరిడేపల్లి, నవంబర్ 29 : వానాకాలం వరికోతలు దాదాపు పూర్తి కావొచ్చాయి. రైతులు యాసంగి పంటలు సాగు చేసేందుకు మరోపక్క సిద్ధ్దమవుతున్నారు. ఈ క్రమంలో వానాకాలం పంటను కోసిన తర్వాత వెంటనే వరి కొయ్యలను, మిగిలిన గడ్డిని రైతులు తగులబెడుతున్నారు. ఇలా వరి కొయ్యలను కాల్చడం వల్ల పొలంలో చేరిన కీటకాలు, వ్యాధికారక సూక్ష్మజీవులను నశింపజేయవచ్చు అనేది రైతుల అభిప్రాయంగా ఉన్నది. కానీ వరి కొయ్యలను కాల్చడం వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడడమే కాకుండా భూసారాన్ని వృద్ధి చేసేందుకు ఉపయోగపడే పదార్థాలు నశించిపోతాయని, కావున వాటిని కాల్చకుండా భూమిలో కలియదున్నితే మంచి ఫలితాలను పొందవచ్చునని నిఫుణులు చెబుతున్నారు. వరి కొయ్యలను కాల్చడం వల్ల కలిగే నష్టాలు, వాటిని భూమిలో కలియ దున్నితే చేకూరే లాభాలు ఈ విధంగా ఉన్నాయి.