పెద్దఅడిశర్లపల్లి, మార్చి 30 : బీఆర్ఎస్ పార్టీకి చెందిన పీఏపల్లి ఎంపీపీ వంగాల ప్రతాప్రెడ్డిపై శనివారం పెట్టిన ఆవిశ్వాసం వీగిపోయింది. మూడు నెలల కిందట తొమ్మిది సభ్యులు అవిశ్వాసం ఏర్పాటు చేయాలని ఆర్డీఓకు విన్నవించడంతో ప్రతాప్రెడ్డి కోర్టును ఆశ్రయించారు. దాంతో ఇంతకాలం వాయిదా పడింది. తిరిగి ఎన్నిక నిర్వహించాలని కోర్టు ఆదేశించడంతో శనివారం దేవరకొండ ఆర్డీఓ శ్రీరాములు సమక్షంలో ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు.
ఎంపీటీసీ సభ్యులు ఎవరూ కూడా సమావేశానికి హాజరు కాకపోవడంతో అవిశ్వాసం వీగిపోయినట్లు ఆర్డీఓ ప్రకటించారు. మండలంలో మొత్తం 14 మంది ఎంపీటీసీలకు గానూ ఎనిమిది మంది టీఆర్ఎస్, ఆరుగురు కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు. ఇందులో నలుగురు ఇటీవల కాంగ్రెస్లో చేరి అవిశ్వాసం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీటీసీలు ప్రతాప్రెడ్డికి మద్దతు ఇవ్వడంతో కాంగ్రెస్కు సరిపడా మెజారిటీ లేక ఆ పార్టీ సభ్యులు సమావేశానికి హాజరు కాలేదు.
దాంతో ప్రస్తుత ఎంపీపీ ప్రతాప్రెడ్డి పదవిలో కొనసాగనున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. అవిశ్వాసం వీగిపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేశాయి. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పీఏపల్లి, అంగడిపేట చౌరస్తాలో పటాకులు కాల్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వల్లపురెడ్డి, గోవిందుయాదవ్, నరేందర్, రామావత్ రవి రహీం, శ్రీనునాయక్, మహేందర్, శ్రీనివాస్, శ్రీను పాల్గొన్నారు.