కొండమల్లేపల్లి, నవంబర్ 10: కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను నమ్మి ఆ పార్టీకి ఓటేస్తే తెలంగాణ ప్రజలంతా ఢిల్లీకి గులాంగిరి జనం చేయాల్సిందేనని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని రమావత్తండా, చేన్నంనేనిపల్లి, వర్ధమాని గూడెం, పెండ్లిపాకల, గుడితండా, చింతకుంట్ల, కోర్రతండా, చిన్నఅడిశర్లపల్లి, గుమ్మడవెళ్లి, దేవరోని తండా, జానిగానితండా, గౌరికుంటతండా, దొనియాల గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో మహిళలు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
అనంతరం ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మాట్లాడుతూ తెలంగాణను మళ్లీ అంధకారం చేయడానికి కాంగ్రెస్ నాయకులు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వలేదని, ప్రజలు పోరాడి సాధించుకున్నారని తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల్లో ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గ్యారెంటి హమీలు పూటకోకటి ఎగిరిపోతున్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అయితే సీఎం కేసీఆర్ ఇంటింటికీ నీళ్లు, 24గంటల కరెంట్ ఇస్తున్నారనే విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ లేని తెలంగాణ ఊహించుకోవద్దని కేసీఆర్ ఒక్కరే మన భవిష్యత్తు తరాలను కాపాడుతారని, కేసీఆర్ కాదని తెలంగాణను డిల్లీ చేతిలో పెడితే మరోసారి ఆగమవుతందని వివరించారు.
మీ కండ్ల ముందు ఉండే వాడిగా భావించి మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుత్తా అమిత్రెడ్డి, నేనావత్ కిషన్ నాయక్, వడ్త్యా రమేష్నాయక్, ఎర్ర జంబావ్, జెడ్పీటీసీ సలహదారుడు పస్నూరీ యుగేందర్ రెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు కేసాని లింగారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమావత్ దస్రూనాయక్, యూత్ అధ్యక్షుడు రమావత్ తులసీరాం నాయక్, మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యా దవ్, అభిషేక్ నాయక్, ఎంపిటీసీ నేనావత్ రజిత కన్వర్లాల్, సర్పంచ్లు రమావత్ బంగారి రూ ప్లా నాయక్, మైనంపాటి వెంకట్రెడ్డి, మేకల పార్వతమ్మ, రమావత్ అంజలి రాంబాబునాయక్, గుండబోయిన లింగం యాదవ్, వడ్త్యా బాలరాం, పేట రమేష్, బద్దునాయక్, శక్రునాయక్, మంతునాయక్, పంగా లాలలయ్య, గోవింద్ నాయక్, షేక్ ఇస్మాయిల్ పాల్గొన్నారు.