వలిగొండ, ఏప్రిల్28 : అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన వాగ్ధాలను మరిచి, ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా మరోసారి మోసానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేశ్ అన్నారు. వలిగొండ మండలంలోని టేకులసోమారం, రెడ్లరేపాక, పులిగిల్ల, వెల్వర్తి, మొగిలిపాక, అరూరు, వేములకొండ, చిత్తాపురం, గొల్నెపల్లి, గోకారం, సంగెం, ఏదుళ్లగూడెం, నాతాళ్లగూడెం, వలిగొండ గ్రామాల్లో ఆదివారం మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డితో కలిసి బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.
ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా క్యామ గుర్తుకు మల్లేశ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కార్తు ఓటు వేసి భువనగిరి పార్లమెంట్ నియోజక వర్గం నుంచి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మోసాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. రైతుబంధు, రుణమాఫీని అమలు చేయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిలదీయాలన్నారు.
నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి బీఆర్ఎస్ గెలుపుకోసం సైనికుల్లాగా పనిచేయాలని, పిలుపునిచ్చారు. తనను గెలిపిస్తే యువతకు ఉపాధి కల్పించే బాధ్యతతోపాటు పార్లమెంట్లో తెలంగాణ ప్రజల పక్షాన వినిపించే గొంతుక తనదేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్రెడ్డి, నాయకులు మొగుళ్ల శ్రీనివాస్, పనుమటి మమత నరేందర్రెడ్డి, కునపూరి కవిత, రేపాక ప్రదీప్రెడ్డి, డేగల పాండరి, సంజీవరెడ్డి, శంకర్గౌడ్ పాల్గొన్నారు.