మాల్,నవంబర్ 18: తెలంగాణకు సీఎం కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం చింతలపల్లి మండలంలోని తీదేడు, దేన్యాతండా, నెల్వలపల్లి, తిర్మలాపురం, ఉప్పరపల్లి, బాద్యతండా, ఉమంతల పల్లి గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మాట్లాడుతూ బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. గ్రామాలు, పట్టణాలు, తండాలు మరింత అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. 3 గంటల విద్యుత్ సరిపోతుందన్న కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎస్తరా.. నాణ్యమైన 24 గంటల కరెంట్ అందించే బీఆర్ఎస్ పార్టీకి ఓటు ఎస్తరా.. ప్రజలు ఆలోచించుకోవాలని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాకే భగీరథ నీళ్లు, గల్లీగల్లీకి సీసీ రోడ్లు, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజల దరి చేరాయని తెలిపారు. రాష్ట్రంలో హరితహారంతో ఎటుచూసినా పచ్చదనం కనిపిస్తుందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు తెలంగాణలో అమలు అవుతున్నాయని పేర్కొన్నారు. మరోసారి అవకాశమిస్తే మరింత అభివృద్ధి చేస్తానన, కారు గుర్తుకు ఓటేసి తనను అధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్రెడ్డి, వర్ధ్య రమేష్ నాయక్, కేతావత్ బిల్యానాయక్, జడ్పీటీసీ సభ్యురాలు కంకణా ప్రవీణ, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్రెడ్డితో పాటు వివిధ గ్రామాల గ్రామశాఖ అధ్యక్షులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చందంపేట: మండలంలోని పోల్యనాయక్తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఇస్లావత్ గోర్యనాయక్ శనివారం కాంగ్రెస్ పార్టీని వీడి ఎమ్మెల్యే రవీంద్రకుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి ఎమ్మెల్యే రవీంద్రమార్ బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధిని కొనసాగించేందుకు తనకు ఎమ్మెల్యేగా మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు, ఉపాధ్యక్షులు ముత్యాల సర్వయ్య, యాసాని రాజవర్ధన్రెడ్డి పాల్గొన్నారు.
పెద్దఅడిశర్లపల్లి : రాష్ట్రంలో ముచ్చటగా మూడో సారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం పీఏపల్లి మండల కేంద్రానికి చెందిన కుంటిగొర్ల హరికృష్ణయాదవ్తో పాటు మరో పదిమంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి దేవరకొండ ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవరకొండ ఎమ్మెల్యేగా తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. బీఆర్ఎస్ నాయకులు తేర భాస్కర్రెడ్డి, మణిపాల్రెడ్డి, మహేందర్, బొలిగొర్ల కొండల్, ధర్మపురం శ్రీనివాసులు, గొర్ల వెంకటయ్య, శ్రీనివాస్, చల్లకృష్ణ, బొలిగొర్ల రామయ్య, అన్వేష్, అనిల్, కృష్ణయ్య, నాగేంద్రబాబు, జగదీశ్, సుధాకర్ పాల్గొన్నారు.
దేవరకొండ: ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లోకి చేరుతున్నట్లు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ చెప్పారు. శనివారం పట్టణంలోని 18 వార్డులోని 50కుటుంబాలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ లోకి ఆధ్వర్యంలో చేరారు. గుమాస్తాల సంఘం నాయకులు, కార్మికులు బీఆర్ఎస్కి మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ రాష్ట్రనాయకులు హన్మంత్ వెంకటేశ్గౌడ్, వైస్ చైర్మెన్ రహత్ అలీ, కౌన్సిలర్ అంజిగౌడ్, నీల రవీకుమార్ తదితరులున్నారు.