మేళ్లచెర్వు, ఫిబ్రవరి 15 : మండల కేంద్రంలోని స్వయంభూ శంభులింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8 నుంచి 12 వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. జాతరకు భక్తులు వేలాదిగా తరలిరానున్నారు.
వారికి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేసేందుకు రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఎస్డీఎఫ్ నిధుల నుంచి కోటి రూపాయలు మంజూరు చేయించారు. ఈ విషయాన్ని హుజూర్నగర్ క్యాంప్ కార్యాలయం అధికారులు గురువారం వెల్లడించారు.