బొడ్రాయిబజార్, జూలై 18 : మహావీర చక్ర కర్నల్ సంతోష్బాబుకు ఆదివారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో భారత్ టైగర్ బిరుదును ప్రదానం చేసినట్లు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ ఈసీ మెంబర్ ఈగా దయాకర్గుప్తా తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్-చైనా సరిహద్దులో వీర మరణం పొందిన బిక్కుమళ్ల సంతోష్బాబుకు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో రాష్ట్ర పోలీస్ అకాడమీ చైర్మన్ కోలేటి దామోదర్గుప్తా, వామ్ గ్లోబల్ అధ్యక్షుడు టంగుటూరు రామకృష్ణ చేతుల మీదుగా బిరుదు ప్రదానం చేసి సంతోష్బాబు సతీమణి సంతోషిని, తల్లిదండ్రులు ఉపేందర్, మంజులను సన్మానించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సంతోష్బాబు కుటుంబ సభ్యులు, వామ్ గ్లోబల్ నాయకులు పాల్గొన్నారు.