– కట్టంగూర్ పీహెచ్సీలో ఆర్వో ప్లాంట్ ప్రారంభం
కట్టంగూర్, ఆగస్టు 23 : గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్యం అందించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమారెడ్డి అన్నారు. కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీ నిధులు రూ.2 లక్షలతో ఏర్పాటు చేసిన (ఆర్వో ప్లాంట్) నీటి శుద్ధి కేంద్రాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఆస్పత్రికి వచ్చే ప్రజలకు శుద్ధ జలాన్ని అందిచేందుకు ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పేద ప్రజలకు కార్పోరేట్ స్థాయిలో వైద్యం అందించన్నుట్లు పేర్కొన్నారు. ఆస్పత్రిలో సమస్యలుంటే తన దృష్టి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలన్నారు.
ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. వర్షాకాలంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా వైద్య సిబ్బంది పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆస్పత్రికి వచ్చే ప్రజలు, సిబ్బంది స్వచ్ఛమైన, సురక్షితమైన నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలన్నారు. నూతనంగా నిర్మించిన ఆస్పత్రికి ఫర్నిచర్ మంజూరు చేయాలని వైద్యాధికారిని శ్వేత తన సిబ్బందితో కలిసి ఎంపీ, ఎమ్మెల్యేకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల, డిప్యూటీ డీఎంహెచ్ఓ లోకసాని వేణుగోపాల్ రెడ్డి, వైద్యాధికారి శ్వేత, మండల ప్రత్యేక అధికారి సతీశ్, తాసీల్దార్ యాదగిరి, ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశరావు, డీటీ ఆల్బట్ ప్రాంక్లిన్, సీహెచ్ఓ నర్సింహారావు, మాజీ జడ్పీటీసీ మాద యాదగిరి, సుంకరబోయిన నర్సింహ్మ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ది సుక్కయ్య, రెడ్డిపల్లి సాగర్ పాల్గొన్నారు.