తుంగతుర్తి, ఆగస్టు 25 : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని ధర్మసమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల చేతిలోకి అధికారం వచ్చినప్పుడే అంబేడ్కర్ ఆశయాలను సాధించినట్లు అని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు బహుజన రాజ్యాధికారం కోసం కలిసికట్టుగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు విజయ్ రామరాజు, మల్లెపాక భాస్కర్ పాల్గొన్నారు.