నార్కట్పల్లి, డిసెంబర్ 23 : మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తజన సంద్రంగా మారింది. శుక్రవారం అమావాస్య కావడంతో దూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అ
మావాస్య సందర్భంగా పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలకు ఆలయ ప్రధాన అర్చకులు పోతులపాటి రామలింగేశ్వరశర్మ ఆధ్వర్యంలో లక్ష పుష్పార్చన ఘనంగా నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ చైర్మన్ మేకల అరుణారాజిరెడ్డి, ఈఓ నవీన్కుమార్ భక్తులకు మౌలిక వసతులు కల్పించారు.