దేవరకొండ: ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చింతపల్లి మండలం వించమూరు గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ మట్ట యాదయ్యతోపాటు కాంగ్రెస్ పార్టీ కి చెందిన పలువురు ఎమ్మె ల్యే సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి కార్య కర్తకు పార్టీ అండగా ఉంటుందన్నారు.
పార్టీలో రూ.100 చెల్లించి క్రియాశీల సభ్యత్వం తీసుకుంటే మృతి చెందిన కుటుంబాలకు ప్రమాద బీమా కింద రూ.2లక్షలు అందజేస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ పేద ప్రజల కోసమే సంక్షే మ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోలేని విధంగా రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్టు, కల్యాణలక్ష్మి వంటి పథకాలు అందిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. కార్య క్రమంలో నాయకులు దండేకార్ మోహన్, మార్కెట్ డైరెక్టర్ అరేకంటి చంద్రయ్య, బిచ్చనాయక్, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ, రాంరెడ్డి, రాములు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.